అందుకనే రైతునే
ఆదర్శంగా తీసుకోవాలని ఉదహరించడం జరిగింది .
ఎందుకంటే రైతు
భూమిలో పంటను వెయ్యాలని అనికొని ఎప్పుడు పడితే అప్పుడు ఎలా పడితే అలా విత్తనాలు
వేయడు . అనుకూలమైన వాతావరణం కోసం ఎదురు చూస్తాడు . పంటకు అనుకూల వాతావరణం
ఏర్పడినపుడు తను వెయ్యదలచుకొన్న విత్తనములు మొలకెత్తే విధంగా భూమిని సాగుచేసి
అనుకూలంగా మార్చు కొంటాడు . పిమ్మట జాగ్రత్తగా విత్తనములు వేసి పంట పక్వమునకు
వచ్చే వరకు వేచి ఉంటాడు . పది పదిహేను సంవత్సరములలో ఎప్పుడో ఒకసారి తుఫానులో ,
వరదలో , లేక అతివృష్టి , అనావృష్టి చేతనో నష్టపోతాడు తప్ప మిగిలిన అన్ని
సంవత్సరములలోనూ ఎంతోకొంత తను పెట్టుబడి పోనూ లాభం తింటాడు . అయితే ఇలా ఎందుకు
అంటున్నాను అంటే ప్రతి సంవత్సరము దిగుబడి ఒకేలా ఉండదు . ఒక్కొక్క సారి ఎక్కువగా ,
మరొక్కసారి తక్కువగా దిగుబడి వస్తుంది కదా.
ఇక్కడ భూమి
ఎక్కడికి పోదు . వేసే పంటలే మారతాయి .
అలాగే మార్కెట్ అనే
భూమిలో రూపాయి అనే విత్తులు నాటండి . రైతు భూమిని సాగుచేసే పద్దతిలో జాగ్రత్తగా
మార్కెట్ని షేర్స్ ని అనాలసిస్ చేసి సరియైన కంపెనీలో పెట్టుబడి పెట్టగలిగితే మనం
పెట్టిన పెట్టుబడికి మంచి ప్రతి ఫలాన్ని
పొందవచ్చు . ట్రేడింగ్ మాత్రం ప్రమాద కరము . సరియైన వ్యూహం ప్రకారం ముందుకు వెళితే
లాభాలే లాభాలు .. వ్యూహం లేకుండా ముందుకు వెళ్ళకండి . మునిగిపోతారు . మార్కెట్ ఎక్కడికి పోదు .
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి