మార్కెట్లో మీరు పెట్టుబడి
పెట్టే సమయములో చాలా అప్రమత్తంగా ఉండండి .
మార్కెట్ లో ఉన్న
కొన్ని కంపెనీల షేర్స్ లో ఆపరేటర్ మాయాజాలము ఉంటుంది . స్తబ్దుగా ఉన్న షేర్స్ ఏ
విధమైన ఫండమెంటల్ లేని షేర్స్ కూడా అతి కొద్ది కాలము లో రెండు రెట్లు మూడు నాలుగు
రెట్లు పెరిగి పోతుంది . అది చూసి అరే ఈ షేరు నెల రోజుల్లోనే ఇంత పెరిగి పోయింది . మనం కొనలేక పోయాము . ఇంకా
పెరిగి పోతుందేమో అని ఆశతో వాటిని కొంటాం . ఇలా అందరి దృష్టి పడే వరుకు
ఆపరేటర్లు ఆకాశానికి తీసుకొని వెళతారు .
అదను చూసి తమ దగ్గర ఉన్న షేర్స్ అమ్మేస్తుంటారు . అంతే ఎంత స్పీడుగా వెళ్లిందో
అంతకన్నా డబుల్ స్పీడుతో షేర్ పడి పోతుంది . దీనివలన ఉన్న షేర్స్ ఏదో ఒక రేటుకి
అమ్మేద్దామని డిసైడ్ అయిపోతాం . తీరా చూస్తే ఆ షేర్ ప్రతి రోజు లోవర్ సర్క్యూట్ ని
టచ్ చేస్తూనే ఉంటుంది .
షేర్ అతి వేగంగా
పెరుగుతుంది అంటే దానిలో ఏదో మతలబు ఉంది అని అర్ధం చేసుకోండి . ఆ కంపెనీ గురించి ,
ఉత్పత్తి చేసే వస్తువులు , మార్కెట్ డిమాండ్,
బాలన్స్ షీట్స్ , మొదలగు విషయములు క్షుణ్ణంగా పరిశీలించాలి . అన్ని
విధాలుగా పరిశీలించిన తరువాత నమ్మకము కలిగితే అప్పుడు పెట్టుబడి పెట్టండి . అంతే
కానీ తొందర పాటుగా వ్యవహరించడం వలన ఉన్నది వూడ్చుకు పోతుంది .
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి